సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత.!

సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. 2024 లో చూసుకుంటే.. ఇప్పటికే చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. ‘బేబీ’ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్, సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్‌, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్రనాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్  (Surya Kiran) వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే.

ఆ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో కమెడియన్ మరణించడం అందరినీ విషాదాల్లోకి నెట్టేసినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తమిళ నటుడు, కమెడియన్ అయినటువంటి శేషు గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 ఏళ్ళు. 10 రోజు క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఈరోజు అనగా మంగళవారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చివరి శ్వాస విడిచారు.

‘లొల్లు సభ’ పేరడీ సిరీస్ తో ఫేమస్ అయిన ఇతను ధనుష్ ‘తుళ్లువదో’, ‘ఇలామై’, ‘వేలాయుధం’, ‘ఏ1’, ‘పారిస్ జయరాజ్’, ‘గుల్ గుల్’, ‘బిల్డప్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. శేషు చివరిగా సంతానం హీరోగా తెరకెక్కిన ‘వడకుపట్టి రామస్వామి’ లో నటించారు

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.